'హిందూ మతంపై నమ్మకం ఉంది' అని చెబుతూ డిక్లరేషన్ అడిగిన టీటీడీ... కోపంగా చూసి, సున్నితంగా తిరస్కరించిన జగన్!

  • తిరుమలలో అన్య మతస్తులకు ప్రవేశం నిషేధం 
  • ఈ ఉదయం దైవ దర్శనానికి వచ్చిన జగన్
  • ఆలయ సమీపంలో ఎదురెళ్లి డిక్లరేషన్ అడిగిన అధికారులు
  • తిరస్కరించి వెళ్లిపోయిన జగన్
తాను తలపెట్టిన పాదయాత్రను విజయవంతం చేయాలని కోరుతూ, వైకాపా అధినేత వైఎస్ జగన్, ఈ ఉదయం తిరుమలకు వచ్చి శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకున్న వేళ, ఓ ఆసక్తికర ఘటన జరిగింది. హిందూ ఆధ్యాత్మిక, భక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్న తిరుమలలోకి అన్య మతస్తుల ప్రవేశం నిషిద్ధమన్న సంగతి తెలిసిందే. ఒకవేళ వస్తే, తమకు హిందూ విశ్వాసాల మీద నమ్మకం ఉందని తెలుపుతూ ఓ డిక్లరేషన్ ఇవ్వాల్సి వుంటుంది.

ఆలయం వద్దకు జగన్ ప్రవేశించిన తరువాత కొందరు టీటీడీ అధికారులు ఆయనకు ఎదురెళ్లి డిక్లరేషన్ ఇవ్వాలని కోరారు. ఆ సమయంలో వారివైపు ఆగ్రహంగా చూసిన జగన్, ఆపై తమాయించుకుని సున్నితంగా తిరస్కరించి దర్శనానికి వెళ్లిపోయారు. జగన్ తో పాటు పలువురు వైకాపా ఎంపీలు, ఎమ్మెల్యేలు స్వామివారిని దర్శించుకున్నారు.
Go Back to Shorts
tirumala
ys jagan
declaration

More Telugu News